తాగిన మైకంలో మహిళపై వేధింపులు

7 May, 2020 20:58 IST|Sakshi

అనుచితంగా ప్రవర్తించిన ఖాకీ

చండీగఢ్‌ : తాగిన మైకంలో ఓ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హర్యానాలో వెలుగుచూసింది. సఫిదాన్‌ పట్టణంలోని నాలుగో వార్డులో బిహార్‌ నుంచి వలసవచ్చిన మహిళ కుటుంబం నివసిస్తోంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పీకలదాకా మద్యం సేవించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ మహిళ ఇంటికి వచ్చి వలస కూలీల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరానికి రావాల్సిందిగా కోరాడు.

రేపు ఉదయం రావాలని తాను సూచించగా తక్షణమే బయలుదేరాలని అంటూ తాకరాని చోట చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించారు. వారించిన తన భర్తపైనా పెద్దగా కేకలు వేశాడని ఇంతలో స్ధానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దర్యాప్తు చేపట్టి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

చదవం‍డి : పెళ్లి సాకుతో రెండేళ్లుగా యువతిపై..

మరిన్ని వార్తలు