కర్ణాటక ,కృష్ణరాజపురం : నగరంలోని మహాదేవుపుర పరిధిలో ఉన్న వైట్ఫీల్డ్లో ప్రముఖ చక్బోల్డ్ క్యూ షోరూమ్లో మహిళలు చీరలు కొనె నెపంతో వచ్చి ఖరీదైన చీరలు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుకాణంలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తే రూ. వేల విలువైన చీరలు మాయమైనట్లు దుకాణం యజమాని కాజల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 26న ఐదుగురు మహిళలు చీరలు కొనడానికి వచ్చారు. అందరూ తెలుగులో మాట్లాడినట్లు చెప్పారు. సీసీ కెమెరాలో ఓ యువతి చీరలు దొంగలిస్తున్నట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.