అత్యాచార కేసు విచారణ ముమ్మరం

6 Feb, 2019 13:28 IST|Sakshi
ఘటనా స్థలానికి వెళుతున్న పోలీసులు

నెల్లూరు, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనా స్థలాన్ని మంగళవారం పోలీసులు పరిశీలించారు. యువతిపై అత్యాచార ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో కేసుకు సంబంధించి విచారణను పోలీసులు ముమ్మురం చేశారు. సీఐ ఎన్‌.కిషోర్‌బాబు మరోమారు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఓ యువకుడి పాత్ర ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు. కాగా నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.  

మరిన్ని వార్తలు