దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు

27 Jan, 2018 09:01 IST|Sakshi
దెబ్బతిన్నపోలీసుల వాహనం

అనంతపురంలో అర్ధరాత్రి కలకలం

సాక్షి, అనంతపురం: అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.. తమపైనే దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన అనంతపురం నగరంలో సంచలనం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి ఓ వాహనంలో ఆవుల చోరీకి కొందరు దొంగలు యత్నించారు. విషయం తెలిసి అడ్డుకోబోయిన పోలీసులపై ఆ ముఠా దాడిచేసింది. దీంతో పోలీసులు దుండగులపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వుతూ దుండగులు పారిపోయారు. పోలీసుల రక్షక్‌ వాహనం దెబ్బతినడంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అంబులెన్స్‌ ఉపయోగించగా దాన్నికూడా ఢీకొట్టి పారిపోవడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


మరిన్ని వార్తలు