దారుణం : రైల్లోంచి గర్భిణి తోసివేత..!

18 Dec, 2018 10:57 IST|Sakshi

సాక్షి, అనంతపురం : కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్య అనే గర్భిణిపై దుండగులు దాడికి దిగారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కునేందుకు యత్నించారు. వారి బారినుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో దివ్యను నిర్దాక్షణ్యంగా రైలులోంచి తోసేశారు. ఈ ఘటనలో గర్భిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు