సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన ముషీరాబాద్లో జరిగింది. స్థానిక సాగర్లాల్ ఆసుపత్రిలో రేవతి(26) ప్రసవం కోసం చేరింది. సకాలం లో వైద్యం అందించకపోవడంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతిచెందింది. కోపోద్రిక్తులైన ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.