రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య

10 Dec, 2017 14:55 IST|Sakshi

ప్రకాశం : అండర్‌ ట్రైల్‌లో ఉన్న ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి సబ్‌ జైలులో చోటుచేసుకుంది. రిమాండ్‌ ఖైదీ రమేష్‌(21)  టాయిలెట్‌ రూంలో తన లుంగీతో  ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు రమేష్‌ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓ దొంగతనం కేసులో రమేష్‌ రిమాండ్‌ ఖైదీగా ఉన్నట్లు జైలు సూపరిండెంట్‌ వసంత రావు తెలిపారు. రమేష్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు