ఖైదీ బంగారం మాయం..!

15 May, 2019 16:09 IST|Sakshi

సాక్షి, నల్గొండ: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి చెందిన బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. 80 వేల విలువైన ఉంగరాలను ఎవరో తస్కరించారని జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటనపై విచారణ చేసేందుకు స్థానిక పోలిస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా లాకర్‌ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేవారు.

మరిన్ని వార్తలు