పోలీసుల కళ్లు గప్పి జైలు నుంచి.. 

27 Oct, 2019 09:44 IST|Sakshi
జైలులోని దృశ్యాలు

ఛత్తీస్‌గఢ్‌ : పోలీసుల కళ్లు గప్పి కొందరు ఖైదీలు జైలునుంచి పరారయ్యారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలియా జిల్లా జైలులో శనివారం​ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు తరుణ్‌ కేవత్‌, ధిరాజ్‌లతోపాటు మరో ఇద్దరు ఐదల్‌, సురేష్‌లు పోలీసుల కళ్లు గప్పి శనివారం అర్థరాత్రి జైలునుంచి ఉడాయించారు. బారెక్‌ తాళం బద్ధలు కొట్టి.. బట్టలు, బెడ్‌షీట్‌లను తాడులా అల్లి దాని సహాయంతో 20 అడుగుల గోడను దూకి పారిపోయారు.

సంఘటనపై సీఎస్పీ ఆశిష్‌ అరోరా మీడియాతో మాట్లాడుతూ.. తరుణ్‌ కేవత్‌, ధిరాజ్‌లు హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఐదల్‌, సురేష్‌లు దొంగతనం కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు