సింగరాయకొండలో రోడ్డు ప్రమాదం

27 Feb, 2020 09:34 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బెంగుళూరు నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు