మోసం కేసులో సినీ నిర్మాత అరెస్ట్‌

31 Oct, 2019 08:14 IST|Sakshi

తిరుపతి క్రైమ్‌: సినీ అవకాశాల పేరుతో ఎంతో మందిని మోసంచేసిన కేసులో నవ్యాంధ్ర ఫిలిం చాంబర్‌ వ్యవస్థాపకుడు ఎస్వీఎన్‌ రావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఏడు నెలల కిందట ఎస్వీఎన్‌ రావు ఆర్థికంగా మోసం చేసినట్లు కేసు నమోదు అయినట్లు చెప్పా రు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడు బుధవారం తిరుపతి మూడో అదనపు జిల్లా కోర్టుకు హాజరవుతున్న విషయం తెలుసుకుని, అక్కడే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. ఆయన కారును కూడా సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపారు.

మరిన్ని వార్తలు