రిపబ్లిక్‌ డే వేడుకల్లో పోలీస్‌ ఆత్మహత్య

26 Jan, 2018 17:20 IST|Sakshi

లుధియానా : పంజాబ్‌లో రిపబ్లిక్‌ డే నాడే విషాదం చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరణ జరుగుతుండాగానే ఓ పోలీస్‌ గన్‌మెన్‌ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్గాన్‌ పట్టణంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. జార్గాన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు డ్రైవర్‌ కమ్‌ గన్‌మెన్‌గా వ్యవహరించే మంజీత్‌ రామ్‌ తన ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకుని బలవన్మరణం పొందాడు.

వేడుకలు జరుగుతున్న సమయంలో మంజీత్‌ బయట కూర్చున్నాడని, వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తలించామని అప్పటికే అతను మరణంచినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. మిస్‌ఫైర్‌ అయిందా తనే కాల్చుకున్నాడా అనే కోణంలో ధర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు