ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

18 Aug, 2018 17:29 IST|Sakshi

ఫగ్వారా : ప్రియుడు మోసం చేశాడని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది ఓ పంజాబీ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషియాపూర్‌ జిల్లాకి చెందిన మనీషా(18) ఫగ్వారాలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. గత గురువారం రాత్రి ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

‘ నా బాయ్‌ఫ్రెండ్‌ ఇందర్‌  నాకు ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. అది నేను తట్టుకోలేక పోతున్నా. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. లేఖలో ప్రియుడి పేరు మాత్రమే రాసి ఉందని, అతని వివరాలు ఏమీ లేవని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఫోన్‌ డేటా పరిశీలిస్తున్నామని..త్వరలోనే మనీషా ప్రియుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. 

భువనగిరిలో మరో యువతి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో మానస అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడని, శారీరంగా వాడుకున్నాడని, తన తల్లిని కూడా ఏమైనా చేస్తాడేమోననే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. మృతురాలి స్వస్థలం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు