డీఎల్‌ఎఫ్‌ మాల్‌లో అనుమానాస్పద మృతి..

22 Nov, 2019 19:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని డీఎల్‌ఎఫ్‌ మాల్‌ టెర్రస్‌పై ఓ వ్యక్తి (47) మృతదేహం లభ్యమైంది. మృతుడిని పీవీఆర్‌ సినిమాస్‌లో పనిచేసే భువన్‌గా గుర్తించారు. మృతుడి తల వెనుక బలమైన గాయాలున్నాయని నోయిడా ఎస్పీ వినీత్‌ జైస్వాల్‌ వెల్లడించారు. ఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఫోరెన్సిక్‌ బృందాలు చేరుకున్నాయని, దర్యాప్తును వేగవంతం చేశామని ఆయన చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఇతర వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు