ఏసీబీకి చిక్కిన రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌

29 Jan, 2018 11:35 IST|Sakshi

సాక్షి, ఎర్రగుంట్ల: లంచం తీసుకుంటూ ఓ రైల్వే పోలీసు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్‌లో దేవానందం అనే వ్యక్తి హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఓ కేసు విషయమై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు