మైనర్‌పై అత్యాచార యత్నం

18 Oct, 2017 13:52 IST|Sakshi

గోప్యంగా ఉంచిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌ : కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని కాప్రా చెరువు వద్ద దారుణం జరిగింది. అశోక్ మణిపురి కాలనీకి చెందిన పదకొండేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులతో స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడు. బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.

మంగళవారం సాయంత్రం తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి బైకుపై వచ్చి బాలికను ఏదో చిరునామా అడిగాడు. తిను బండారాలు ఆశ చూపి  చెరువు వద్దకు తీసుకెళ్ళి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు.

మరిన్ని వార్తలు