నర్సరావుపేటలో రియాల్టర్‌ దారుణ హత్య

14 Sep, 2019 18:29 IST|Sakshi

గుంటూరు : నర‍్సరావుపేటలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. రావిపాడు రోడ్డులోని ఓ వెంచర్‌ సమీపంలో వ్యాపారి తడికమల‍్ల రమేష్‌ మృతదేహం లభ్యమైంది.  స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రెండు కోట్ల రూపాయల లావాదేవీలే ఈ హత‍్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు