సాక్షి, నల్గొండ : పట్టణంలో దారుణహత్య చోటుచేసుకుంది. సోమకేశవులు అనే రియల్టర్ మంగళవారం హత్యకు గురయ్యారు. చైతన్యపురి కాలనీలో తన ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని విచారిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో కారంపొడి, రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు.