రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

1 Feb, 2018 12:59 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పెద్ద మొత్తంలో గురువారం ఎర్రచందనం పట్టుబడింది. జిల్లా సరిహద్దు అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, 20 సెల్‌ఫోన్స్‌, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్లని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు