బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

26 Dec, 2019 07:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున ఏపీ 09 ఏపీ 0815 నెంబరు గల కారు అతివేగంతో వచ్చి రోడ్డు పక్కన పార్క్‌ చేసిన మరో కారును ఢీ కొట్టి.. ఫుట్‌ పాత్‌పైకి దూసుకెళ్లింది. దీంతో రోడ్లను శుభ్రం చేస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కారులో ఉన్న ముగ్గురు యువకులను అత్తాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు.  అయితే వారు మద్యం మత్తులో వాహనం నడిపినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం కారులోని యువకులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు