నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

5 Feb, 2020 13:18 IST|Sakshi

సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ హైవేపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును, లారీ ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి దేవరకొండకు వెళ్తుండగా చిలకమర్రి స్టేజ్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు కాళ్లు విరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు