ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

15 Jan, 2020 15:52 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : పండగ వేళ తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రావులపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢికొనడంతో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడ వైపు వెళ్తున్న కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు