ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

6 Feb, 2019 09:35 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఓ ఫంక్షన్‌కు ముదిగొండ వెళ్లి వస్తుండగా వారు వెళ్తున్న బైక్‌ను.. అర్ధరాత్రి సమయంలో నేలకొండపల్లి చెరువుకట్ట నక్కల తూము వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. నేలకొండపల్లి డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీకి చెందిన పాలపాటి వెంకటేశ్వర్లు, అతని తల్లి పిచ్చమ్మ, అతని ఇద్దరి కుమారులు 8 ఏళ్ల కోదండరామ్‌, 6 ఏళ్ల ప్రణయ్‌ ఈ ఘటనలో మృతిచెందారు. జరిగిన ఘోరం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు