రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..ఐదుగురికి గాయాలు

28 Apr, 2018 09:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : వాంఖిడి మండల కేంద్రంలోని  ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక  నుంచి కారును  లారీ ఢీకొనడంతో ముందున్న లారీలోకి  కారు చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహారాష్ట్రలోని గోంద్యాకు చెందిన గోల్గామ్ వార్ రాములు (60) మృతి చెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు