చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

8 Nov, 2019 19:49 IST|Sakshi

వాహనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్‌

పది మందికిపైగా మృతి, అనేక మందికి గాయాలు

సాక్షి, చిత్తూరు: బంగారుపాళ్యం మండలం మొగలిఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలపైకి ఓ భారీ కంటైనర్‌ దూసుకపోవడంతో పది మందికిపైగా మృత్యువాత పడగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్కూటర్‌ పూర్తిగా దగ్దమైంది. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు