కృష్ణాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

5 Dec, 2019 17:41 IST|Sakshi

సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నందిగామ నుంచి నలుగురు యువకులు కారులో(ఏపీ16డీబీ 5587) విజయవాడకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అంబార్‌పేటకు చేరుకోగానే అతివేగంతో డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతులను నందిగామకు చెందిన దుర్గా, మనోజ్‌, అరవింద్‌, అనిల్‌గా గుర్తించారు. కాగా, ప్రమాద సమయంలో కారు 120 కి.మీ వేగంతో వెళ్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


మరిన్ని వార్తలు