ఆసిఫాబాద్క్రైం : ఆదిలాబాద్ జిల్లా మండలంలోని కౌటగూడ వద్ద శనివారం రాత్రి ఆటోబోల్తా పడగా ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయపడ్డారు. ఎస్సై కమ్రుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఆసిఫాబాద్ నుంచి కొద్దుగూడకు వెళ్తుండగా కౌటగూడ మూలమలుపు వద్ద ఆటోబోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కొరెంగ రాజేశ్వర్, కనక సత్తుబాయి, కుమరం సత్తుబాయి, రుక్మబాయి, సోములకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
త్రీవ గాయాలైన రాజేశ్వర్ను ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి భార్య బీజ్జిబాయి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసున్నట్లు ఎస్సై తెలిపారు.