ఘోర ప్రమాదం : ఇద్దరు మృతి

17 Mar, 2018 09:04 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి కడ్తాల్ మండలం మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలోఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి  తీవ్ర గాయాలయ్యాయి.   కారులో ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండా ఈ ఘటన చోటుచేసుకుంది.  అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు