గంజాయి అక్రమ రవాణా చేస్తూ.. 

12 May, 2019 10:22 IST|Sakshi

సాక్షి, విజయనగరం : తుమ్మికాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తుండటంతో మితిమీరిన వేగంతో ప్రయాణించారు. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీని, అరకు నుంచి వస్తున్న కారు డీకొట్టింది.

ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మార్గమద్యలో మృతి చెందాడు. మరో వ్యక్తికి చికిత్సను అందిస్తున్నారు. కారులో రెండు ​బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి లోడ్‌తో అతి వేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు