సాక్షి, హైదరాబాద్ : వారాసిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తున్న సమయంలో ఓ టాటాఏస్ వాహనం గుంపు పైకి దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఊరేగింపులో భాగంగా టాటాఏస్ డ్రైవర్ డ్యాన్స్ చేసేందుకు దిగి రాగా.. బాలుడు వాహనాన్ని నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.