ఐసన్‌ వ్యాన్‌ ఢీ కోట్టడంతో మహిళా మృతి

30 Jan, 2020 13:35 IST|Sakshi

సాక్షి, కృష్ణా: గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. విమానాశ్రయ సమీపంలో గురువారం జరిగిన ఘటనలో ఓ మహిళా మృతిచెందింది. కాగా సైకిల్‌పై వెళ్తున్న భార్యభర్తలను వెనక నుంచి వస్తున్న ఐసన్‌ వ్యాన్‌ ఢికోట్టిడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. భార్యభర్తలు కేసరపల్లికి చెందిన వారని, మేధా టవర్స్‌లో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు