చాదర్‌ఘాట్‌లో దొంగల బీభత్సం

17 Feb, 2018 12:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో చొరబడిన దొంగలు భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 35 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదు అపహరణకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసు​కున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు