దోపిడీ దొంగల అరెస్ట్‌

3 Sep, 2018 13:19 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న బైకులు ,దుండగులు నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ, బులెట్లు

ఒడిశా, బరంపురం: తుపాకీతో ఓ వెండి నగల వ్యాపారిని బెదిరించి, నగదు దోచుకెళ్లిన సుమారు ఐదుగురు దొంగలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక తుపాకీతో పాటు తుపాకీ బులెట్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు వ్యాపారులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఎస్‌డీపీవో అశ్వినీకుమార్‌ అందించిన సమాచారం ప్రకారం... జిల్లాలో కొద్ది రోజుల క్రితం కవిసూర్యనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పత్తర–పండామరి రహదారిలో ఉన్న వెండి నగల దుకాణంలో సుమారు ఐదుగురు దుండగులు ప్రవేశించారు. అనంతరం దుకాణంలో ఉన్న వ్యాపారిని తుపాకీతో బెదిరించి, సుమారు ఏడున్నర కిలోల వెండితో పాటు సుమారు రూ. 6 వేలు దోచుకుని పరారయ్యారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దుండగులను అరెస్టు చేసినట్టు ఎస్‌డీపీవో తెలిపారు.

>
మరిన్ని వార్తలు