రెచ్చిపోయిన రౌడీ మూకలు.. పోలీసులపై దాడికి యత్నం

29 Jun, 2019 07:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో రౌడీ మూకలు బరితెగించాయి. ఇద్దరు రౌడీలను అరెస్ట్‌ చేశారన్న అనుమానంతో పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాయి. ఈ సంఘటన హైదరాబాద్ హబిబ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. ఓ ఇద్దరు రౌడీలను హబిబ్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న అనుమానంతో రౌడీమూకలు హబిబ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడుతూ వారిపై కూడా దాడికి యత్నించారు. అంతు చూస్తామంటూ పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.

మరిన్ని వార్తలు