శుక్రవారం ఒక్కరోజే 3.24 కోట్లు స్వాధీనం

12 May, 2018 04:27 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కూడా రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో రూ.3.24 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొళకాల్మూరు వద్ద ఓ స్కార్పియో వాహనంలో రూ.2.17 కోట్లను గుర్తించారు. కోలారు సమీపంలో లారీలో సిమెంట్‌ సంచుల్లో తరలిస్తున్న రూ.70 లక్షల నగదును జప్తు చేశారు. బాగల్‌కోట్‌లో రూ.20 లక్షలు, బెంగళూరు శివారు ప్రాంతంలో రూ.17 లక్షల నగదు పట్టుబడింది. దీంతో ఇప్పటి వరకు పోలీసులు, ఎన్నికల ప్రత్యేక బృందాలు రూ.55 కోట్ల నగదు, సుమారు 8 వేల లీటర్ల మద్యం, సుమారు 100 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 

మరిన్ని వార్తలు