రూ.33.72 లక్షల నగదు స్వాధీనం

23 Oct, 2018 03:14 IST|Sakshi
నగదు బ్యాగును చూపిస్తున్న ఎన్నికల అధికారి

నాగర్‌కర్నూల్‌ క్రైం/కందనూలు: నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని అల్లీపూర్‌ చెక్‌పోస్టు వద్ద రూ.33.72 లక్షల నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన పల్లీల వ్యాపారి సాంబశివారెడ్డి ఆదివారం అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో ఈ నగదును తీసుకువెళ్తున్నాడు. అల్లీపూర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. సాంబశివారెడ్డి వాహనం లోని ఓ బ్యాగును తెరిచి చూడగా నగదు ఉన్నట్లు గుర్తించారు.

వాటికి ఎలాంటి రశీదులు చూపకపోవడంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశం మేరకు నగదును స్వాధీనం చేసుకొని రిటర్నింగ్‌ అధికారి హన్మానాయక్‌కు అందజేశారు. ఈ విషయమై ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు, జిల్లా మానిటరింగ్‌ కమిటీ, జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇచ్చామని హన్మానాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు