ఆర్టీసీ బస్సు బీభత్సం

2 Mar, 2019 09:41 IST|Sakshi
గాయపడిన ఖాజాపాషా, సునితారెడ్డి

కారు ధ్వంసం ఇద్దరికి గాయాలు

సుల్తాన్‌బజార్‌: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ ఓ క్యాబ్‌ను ఢీ కొట్టడంతో కారు డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికురాలికి తీవ్ర గాయాలైన సంఘటన సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్కొండకు చెందిన ఖాజాపాషా ఓలా క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సునితారెడ్డి కూకట్‌పల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకుంది.

కారు కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లోని సెంట్రల్‌ బ్యాంక్‌ సమీపంలోకి రాగానే పటాన్‌ చెరు వెళుతున్న ముషీరాబాద్‌ డిపోకు  ఆర్టీసీ బస్సు క్యాబ్‌ను ఢీ కొనడంతో డ్రైవర్‌ ఖాజాపాషాతో పాటు ప్రయాణికురాలు సునితారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ నాగయ్యను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సుల్తాన్‌బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు