ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి గాయాలు

17 May, 2019 16:38 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : కల్వర్టును ఢీకొట్టి, ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలనుంచి చెన్నూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జైపూర్‌ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. సంఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి బస్సు నడపటంతో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను అత్యవసర చికిత్స నిమిత్తం దగ్గరలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  భూపాలపల్లి ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవటంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు

మరిన్ని వార్తలు