సుప్రీంకోర్టులో సజ్జన్‌ కుమార్‌ పిటిషన్‌

23 Dec, 2018 05:42 IST|Sakshi

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవశిక్ష ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత సజ్జన్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో సిక్కుల తరఫు న్యాయవాది హెచ్‌.ఎస్‌.ఫూల్కా మీడియాతో మాట్లాడుతూ.. సిక్కుల ఊచకోత వ్యవహారంలో తాము గతంలోనే సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశామని తెలిపారు. దీంతో సజ్జన్‌ కుమార్‌ పిటిషన్‌పై కోర్టు రిజిస్ట్రీ ద్వారా తమకు సమాచారం అందిందన్నారు.

మరిన్ని వార్తలు