మళ్లీ అదే తరహా చోరీ

29 May, 2018 08:10 IST|Sakshi
దుండగులు దగ్ధం చేసిన దుస్తులు 

నిజామాబాద్‌ రూరల్‌ : చోరీలు చేయడంలో ఆరితేరిన దొంగలు.. సాక్ష్యాలు దొరకకుండా యత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హబీబ్‌నగర్‌లో శనివారం రాత్రి దొంగతనం చేసిన నిందితులు.. ఇంటికి నిప్పు పెట్టి వెళ్లారు. అదే తరహాలో ఆదివారం రాత్రి నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీకి పాల్పడిన దుండగులు.. ఇంట్లోని వస్తువులకు నిప్పు పెట్టి పరారయ్యారు.

ముబారక్‌నగర్‌కు చెందిన సర్వేశ్‌ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. రాత్రి వేళ తాళం పగులగొట్టి లోనికి చొరబడిన దొంగలు.. బీరువాలో దాచిన రూ.10 వేల నగదు, తులం బంగారం అపహరించారు. అనంతరం సాక్ష్యాలు దొరకకుండా ఇంట్లో నిప్పుపెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్‌ డీఎస్పీ సుదర్శన్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.  
 

మరిన్ని వార్తలు