సాక్షి, హైదరాబాద్ : ‘మేము ఇద్దరం మరణించాక పక్కపక్కనే సమాధులు ఉంచాలి’ అంటూ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. ప్రేమ వ్యవహారం, కుటుంబ కలహాలతో నల్గొండ జిల్లా రంగారెడ్డి గూడకు చెందిన సందీప్ రెడ్డి, త్రివేణి కూల్డ్రింక్లో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో సందీప్రెడ్డి మృతి చెందగా, త్రివేణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
ఈ దుర్ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వీరిద్దరు బంధువులు అయ్యింటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు.