బ్రిడ్జిపై మాటువేసి మహిళ రాగానే..

6 Feb, 2020 18:03 IST|Sakshi

ముంబై : నగరంలోని మతుంగ రైల్వే స్టేషన్‌లో మాటువేసి నిర్మానుష్యంగా ఉండే అక్కడి బ్రిడ్జ్‌పైకి మహిళలు రాగానే వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం పనిగా పెట్టుకున్న యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. చోరీ కేసులో పట్టుబడ్డ నిందితుడిని మహిళల పట్ల అనుచితంగా ప్రవరిస్తున్న వ్యక్తిగా  సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. చోరీ కేసులో గురువారం అరెస్టయిన క్రమంలో అతడి నిర్వాకాన్ని ముంబై పోలీసులు తెలుసుకుని నివ్వెరపోయారు.

చోరీ కేసులో అరెస్టయిన నిందితుడిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తూ మహిళలు ఎవరూ ఇంకా ముందుకురాలేదని పోలీసులు తెలిపారు. దొంగతనం కేసులో నిందితుడికి బెయిల్‌ లభించిందని చెప్పారు. ఇక మహిళను వేధిస్తూ బయటపడిన సీసీటీవీలోని తాజా వీడియో జనవరి 25 నాటిదిగా గుర్తించారు. ఈ వీడియోలో నిందితుడు మహిళా ప్రయాణీకురాలని అసభ్యంగా తాకుతూ బలవంతంగా ముద్దు పెట్టుకుని పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళ భయంతో వెనక్కు తిరిగి చూస్తూ నిందితుడి నుంచి దూరంగా పరిగెడుతున్నట్టు కనిపించింది.

చదవండి : యువతిపై తాత, మేనమామ లైంగిక దాడి

మరిన్ని వార్తలు