సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడుగురు మృతి

15 Jun, 2019 11:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గాంధీనగర్‌ : గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లోని సెప్టిక్‌ట్యాంక్‌ను క్లీన్‌ చేస్తుండగా.. ఆ హోటల్‌కు సంబంధించి ముగ్గురు సిబ్బందితో పాటు మరో నలుగురు కార్మికులు చనిపోయారు. అందులో అజయ్‌ వాసవ్‌(24), విజయ్‌ చౌహాన్‌(22), సహదేవ్‌ వాసవ(22)లను హోటల్‌ సిబ్బందిగా గుర్తించగా.. మిగిలిన నలుగురు పారిశుద్ద్య కార్మికులు ధబోయ్‌ ప్రాంతంలోని థువావికి చెందినవారుగా తెలుస్తోంది.

ఈ ఘటనపై ధబోయ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే హోటల్‌ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తుండగా.. ఏదైనా గ్యాస్‌ లీకై మరణించి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు