ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం

23 Dec, 2019 03:31 IST|Sakshi

థానే: ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసి, హత్యాచారం చేసిన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం చిన్నారి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు తెలపడంతో నిందితుడు కొరి (30)ని అరెస్ట్‌ చేశారు. భివండి డీసీపీ రాజ్‌కుమార్‌ షిండే కథనం ప్రకారం.. కరివాలి గ్రామానికి చెందిన కొరి శనివారం రాత్రి రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. అనంతరం చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బండరాయితో తలపై మోది చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆదివారం ఉదయం పొదల మాటున చిన్నారిని మృతదేహాన్ని చూసిన బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కొరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు