ట్రాక్టర్‌ ట్రాలీ​ బోల్తా ఆరుగురి మృతి

18 Nov, 2019 21:01 IST|Sakshi

పట్నా: ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడి ఆరుగురు బాలికలు మృతి చెందిన ఘటన  బిహార్‌ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. రాజస్తాన్‌ నుంచి టైల్స్‌ తీసుకువస్తున్న భారీ ట్రాలీ గోపాల్‌గంజ్‌ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో అక్కడే ఆడుకుంటున్న ఆరుగురు బాలికలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు