సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

13 Dec, 2018 09:16 IST|Sakshi
సాయి దుర్గాభవాని మృత దేహం

మలక్‌పేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలక్‌పేట పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఏడుకొండలు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వీరశేఖరం ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ సలీంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతని కుమార్తె సాయిదుర్గా భవాని (24) గచ్చిబౌలిలోని జెన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. బుధవారం ఉదయం ఆమె బెడ్‌రూంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండేళ్లుగా టీబీతో బాధపడుతోందని, మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు