పెళ్లి చేయలేదని హత్య

24 Apr, 2020 10:24 IST|Sakshi

వేలూరు (తిరువణ్ణామలై): తిరువణ్ణామలై తండ్రాంపట్టు సమీపంలోని కుప్పంతాంగల్‌ గ్రామానికి చెందిన కూలీ గోవిందస్వామి(60), మాంగణి(55) దంపతులకు కొడుకు రామ్‌కుమార్, ముగ్గురు కుమార్తెలున్నారు. గోవిందస్వామి తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశాడు. ప్రస్తుతం రామ్‌కుమార్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే రామ్‌కుమార్‌ తనకు వెంటనే వివాహం చేయాలని తరచూ ఘర్షణ పడేవాడు. బుధవారం వేకువజామున రామ్‌కుమార్‌ ఇంట్లో ఉన్న రుబ్బు రాయిని తీసి గోవిందస్వామి, మాంగణి తలపై వేయడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు.

తరువాత ఇంటికి తాళం వేసి రామ్‌కుమార్‌ తిరువణ్ణామలైకి సైకిల్‌లో వెళ్లాడు. గురువారం ఉదయం గోవిందస్వామి కుమార్తె తల్లిదండ్రులను చూసేందుకు రాగా ఇంటికి తాళం వేసి ఉండడంతో కిటికీలో చూడగా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి కేకలు వేసింది. స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా సాతనూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనంతరం  నిందితుడు రామ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు