తండ్రిని చంపి.. ఇంటి పక్కనే పూడ్చి..

10 Jun, 2019 13:08 IST|Sakshi

సాక్షి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బర్మా కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తాగి వచ్చి తరచూ వేధిస్తున్నాడని కోపంతో తండ్రిని తల్లి సహకారంతో చంపి శవాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టాడో కుమారుడు. తాగిన మైకంలో తల్లితో కలిసి తండ్రి గోపిరెడ్డి ఈశ్వర రావు(55)ని తానే చంపానని కుమార్(21) తన చిన్నాన్నతో చెప్పడంతో ఈసంఘటన రెండు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విషయం అందరికీ తెలియడంతో నిందితుడు కుమార్ మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం కుమార్‌ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోపిరెడ్డి ఈశ్వర రావుకి నలుగురు అమ్మాయిలు కాగా, వారిలో ముగ్గురుకి వివాహం జరిగింది. అందరూ కుమార్తెలు కావడంతో, కుమార్‌ను దత్తత తీసుకుని పెంచుకున్నాడు.

మరిన్ని వార్తలు