హత్య చేసి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించి

16 Sep, 2018 10:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గుంటూరు : ఆస్తి కోసం మామను చంపాడు ఓ అల్లుడు. హత్యను యాక్సిడెంట్‌గా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో చోటుచేసుకుంది. తుమ్మలచెరువుకు చెందిన శివశంకర్‌ అనే వ్యక్తికి తన మామతో గత కొద్దిరోజులుగా పొలానికి సంబంధించి తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అల్లుడు మామను హత్య చేశాడు. హత్యను ప్రమాదంగా మలచటానికి చూశాడు. మృతదేహాన్ని హైవేపై పడేసి యాక్సిడెంట్‌గా నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.   

మరిన్ని వార్తలు