బౌలింగ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు

27 Jan, 2018 11:09 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్: అప్పటివరకు ఉత్సాహంగా బౌలింగ్‌ చేసిన ఓ యువకుడు అంతలోనే మైదానంలో కుప్పకూలిపోయాడు. బౌలింగ్‌ చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్‌లో జరుగుతున్న ఓ క్రికెట్ టోర్నమెంట్‌లో చోటుచేసుకుంది. క్రికెట్‌ టోర్నమెంటులో పాల్గొన్న లాయిడ్ ఆంథోనీ అనే 23 ఏళ్ల యువకుడు బౌలింగ్‌ చేస్తూ.. మైదానంలోనే ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు